Trishul News

అరుదైన బల్లి.. అక్షరాలా ధర రూ.కోటి..!

బీహార్, త్రిశూల్ న్యూస్ :
అంతరించిపోతున్న తక్షక్ జాతికి చెందిన అరుదైన టోకే గెక్కో బల్లిని బీహార్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పూర్నియా జిల్లాలోని ఓ మెడికల్ స్టోర్ లో బల్లి, దగ్గు సిరప్స్ పట్టుకున్నారు. రికవరీ చేసిన వాటి విలువ రూ.కోటి ఉంటుందని పోలీసులు వెల్లడించారు. బల్లిని పశ్చిమ బెంగాల్ లోని కరాంఢిఘి నుంచి బీహార్ కు తీసుకొచ్చినట్లు గుర్తించారు. ఈ ఘటనలో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మధుమేహం, క్యాన్సర్ వ్యాధుల ఇతరత్రా మందుల తయారీలో ఉపయోగిస్తారు. ఆగ్నేయాసియా దేశాల్లోనూ తక్షకు మంచి డిమాండ్ ఉంది.

Post a Comment

Previous Post Next Post