Trishul News

సిగ్గుమాలిన సీఎంకు ఇకనైనా బుద్ధి మారాలి - టిడిపి

తిరుపతి, త్రిశూల్ న్యూస్ :
రాయలసీమ ప్రాంత వాసిగా ప్రాతినిధ్యం వహించి సీఎం కుర్చీలో కూర్చొని.. రాయలసీమ అభివృద్ధికి సహకరించకపోవడం బాధాకరమని, ఈ సిగ్గుమాలిన చేతగాని సీఎం పాలనను రాష్ట్ర ప్రజలు సహించలేకపోతున్నారని.. టిడిపి నేతలు నరసింహా యాదవ్, చిన్నబాబు, డాక్టర్ సుధాకర్ రెడ్డి , సూరా సుధాకర్ రెడ్డి , చేజర్ల మనోహరాచారి తదితరులు వైకాపాను ప్రశ్నించారు. శనివారం మీడియాతో వీరు మాట్లాడుతూ.. టిడిపి హయాంలో జరిగిన అభివృద్ధి నేటికీ కనపడుతుందని, వైకాపా మూడున్నర సంవత్సరాల కాలంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడేఉన్నదన్నారు. ప్రపంచ వ్యాప్తంగా భక్తులు శ్రీవారి దర్శనం కోసం తిరుపతికి వస్తున్నారని .. అలాంటి తిరుపతిలో రోడ్లు ఇతరత్రా వాటిని బాగు చేయలేని పరిస్థితుల్లో స్థానిక వైకాపా పాలకులు ఉన్నారని దుయ్యబట్టారు.. ఇకనైనా సీఎం జగన్ కు బుద్ధి మారి సీమ అభివృద్ధికి పాటుపడాలని డిమాండ్ చేశారు.

Post a Comment

Previous Post Next Post