Trishul News

బాలికను హత్యాచారం చేసి చంపిన బాబాయ్..!

మహబూబ్‌నగర్‌, త్రిశూల్ న్యూస్ :
మహబూబ్‌నగర్‌ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వరసకు కూతురయ్యే అమ్మాయిపై లైంగికదాడికి పాల్పడి ఆమెను హత్య చేశారు. వివరాల్లోకెళ్తే.. బాలానగర్ మండలం తిరుమలగిరి కేశవ నాయక్ తండాకు చెందిన హనుమంతు నాయక్‌, భార్య ఇద్దరు పిల్లలతో ఇటీవల హైదరాబాద్‌లో శుభకార్యానికి వెళ్లారు. దీంతో పదవ తరగతి చదువుతున్న తన చిన్న కుమార్తె మాత్రమే ఇంట్లో ఉంది. ఇది గమనించిన కొందరు యువకులు అర్ధరాత్రి ఇంటికి వచ్చి ఆ బాలికను బలాత్కారం చేసి, హతమార్చినట్లు సమాచారం.
కాగా, మృతి చెందిన విద్యార్థినికి సమీప బంధువైన శీను నాయక్‌(వరుసకు బాబాయ్)తో తోపాటు.. చిన్న రేవల్లికి చెందిన శివ.. మరికొందరు యువకులే మృతికి కారకులుగా భావిస్తున్నారు. ఘటనపై ఆగ్రహించిన విద్యార్థిని బంధువులు, తల్లిదండ్రులు వారి ఇళ్లపై దాడికి దిగారు. మరోవైపు శివ టీవీ రిపేర్ షాప్‌లో ఉన్న సామాగ్రిని బయటకు తెచ్చి అతని కారుతోపాటు వాటిని తగలబెట్టారు. దీంతో ఇటు తిరుమలగిరి.. అటు చిన్న రేవల్లి గ్రామాలలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Post a Comment

Previous Post Next Post