Trishul News

నడిరోడ్డుపై నాగుపాము.. నిలిచిపోయిన ట్రాఫిక్..!

దోర్నాల, త్రిశూల్ న్యూస్ :
ప్రకాశం జిల్లా దోర్నాల - మార్కాపురం ప్రధాన రహదారిలో నడి రోడ్డుపై నాగుపాము దర్శనమిచ్చింది. పెద్దారవీడు మండలం బద్విడు చెర్లోపల్లి వద్ద ఓ నాగుపాము నడిరోడ్డుపై పడగ విప్పి నిలిచింది. దీంతో ఆ రహదారిలో వాహనాలన్నీ సుమారు అర గంటపాటు నిలిచిపోయి ట్రాఫిక్ ఏర్పడింది. వాహనాలు ముందుకు వెళ్తే వాటిని వెంబడిస్తుండడంతో వాహనాలన్నీ ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. తర్వాత ఆ నాగుపాము వెళ్లిపోగా ట్రాఫిక్ క్లియర్ అయింది.

Post a Comment

Previous Post Next Post