Trishul News

పవిత్ర పుణ్యక్షేత్రంలో వ్యభిచార కూపం..!

- నామమాత్రపు పర్యవేక్షణలో పోలీస్ యంత్రాంగం 
తిరుపతి, త్రిశూల్ న్యూస్ :
పరమ పవిత్ర క్షేత్రమైన తిరుపతి అంటే ముందుగా గుర్తుకు వచ్చేది శ్రీ వేంకటేశ్వర స్వామి వారు కొలువైయున్న తిరుమల పుణ్యక్షేత్రం. శ్రీవారి పాదాల చెంత ఉన్న తిరుపతికి ప్రతి నిత్యం లక్షల సంఖ్యలో భక్తులు దేశ విదేశాల వస్తుంటారు. అంతే కాకుండా బ్రతుకు తెరువు కోసం వివిధ ప్రాంతాల నుండి వచ్చి ఇక్కడ నివసిస్తూ జీవించే వాళ్ళు కొందరైతే... తమ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం యూనివర్సిటీలో చదివించే వాళ్ళు మరికొందరు. ఇలా ఉద్యోగస్తులతో, వ్యాపారస్తులతో, స్కూల్, కాలేజీ స్టూడెంట్స్ తో బిజీ బిజీగా ఉండే తిరుపతి ఇప్పుడు వ్యభిచారం గూపంగా మారుతోంది.

సాక్ష్యాత్తు పద్మావతి అమ్మవారి ఆలయ సమీపంలోనే...

ఇక్కడికి వచ్చే భక్తులు, వ్యాపారం కోసం వచ్చే వాళ్ళనే టార్గెట్ గా చేసుకుని వ్యభిచారం సాగిస్తున్నారు కొందరు వ్యక్తులు. పుణ్యక్షేత్రం అనే కనీస జ్ఞానం లేకుండా వ్యభిచార గృహాలను నడుపుతున్నారు. అమ్మాయిలను సప్లై చేస్తూ... అందిర్నీ రెచ్చగొడ్తూ సొమ్మ చేస్కుంటున్నారు. సాక్షత్తు శ్రీనివాసుడి అర్ధంగి అయిన పద్మావతి అమ్మవారు కొలువైయున్న తిరుచానూరులో వ్యభిచార కూపం వెలుగు చూడడం గమనార్హం. ఆధ్యాత్మికతకు ఇలాకా అయిన పద్మావతి అమ్మవారి సన్నిధికి సమీపంలో వ్యభిచార కూపం వెలుగు చూసింది.

ఏడుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు..
తిరుచానూరుకి అతి సమీపంలోని పద్మావతి పురంలో ఓ ప్రైవేట్ లాడ్జిలో వ్యభిచారం జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. ప్రైవేటు లాడ్జ్ ఓనర్ వెంకట సుబ్బారెడ్డిని, క్యాషియర్ విజయ్ తో పాటు మరో ఐదుగురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. అయితే ముందస్తుగానే పోలీసుల రాకను గుర్తించిన మహిళల చేత వ్యభిచారం చేయించే నిర్వాహకుడు ఎల్లారెడ్డి పరార్ అయ్యాడు. ఈ ఏడాది మార్చి నెలలో తన ఇంట్లోనే వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు ఎల్లారెడ్డిని పోలీసులు గుర్తించారు. అప్పట్లో దీనిపై కేసు కూడా నమోదైంది.

ఎల్లారెడ్డి కోసం గాలింపు చర్యలు..

పట్టుబడిన మహిళల్లో బెంగళూరు, భద్రాచలం వాసులుగా పోలీసులు గుర్తించారు. పోలీసుల దాడుల్లో పట్టుబడిన లాడ్జ్ నిర్వహుకుడు వెంకట సుబ్బారెడ్డి, క్యాషియర్ విజయ్, ఎల్లారెడ్డిలతో పాటుగా ఐదుగురు యువతులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తున్నారు.. ఇక పరార్ లో ఉన్న ఎల్లారెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు. త్వరలోనే అతడిని కూడా పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు. అలాగే పరమ పవిత్ర పుణ్యక్షేత్రం అయిన తిరుమలలో అలాంటివి జరగుండా చూస్తామంటున్నారు పోలీసులు.

విషయం తెలుసుకున్న స్థానిక ప్రజలు, భక్తులు తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు. స్వామి వారి చెంత ఇలాంటి పనులు చేయడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇంకెప్పుడు అక్కడ ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాలని కోరుతున్నారు. తిరుమలకు వచ్చే భక్తులకు.. అమ్మాయిలను ఆశగా చూపి వ్యభిచారం చేయడం మహా పాపమని అంటున్నారు. భక్తి, ముక్తి కోసం వచ్చే వాళ్లను వ్యభిచారం దిశగా ప్రోత్సహించడం అస్సలు మంచిది కాదని చెబుతున్నారు. చూడాలి మన పోలీస్ వ్యవస్థ ఎలాంటి చర్యలు చేపడుతుందో.

Post a Comment

Previous Post Next Post