Trishul News

బి. కొత్తకోటలో 10న వాహనాలు వేలం పాట - ఎస్సై రామ్మోహన్

బి.కొత్తకోట, త్రిశూల్ న్యూస్ :
అన్నమయ్య జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు,మదనపల్లి డిఎస్పీ పర్యవేక్షణలో వివిధ కేసులో పట్టుబడిన 15 వాహనాలకు ఈనెల 10వ తేదీన ఉదయం 11 గంటలకు పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో వేలం పాటను నిర్వహిస్తున్నట్లు బి.కొత్తకోట ఎస్.ఐ.రామ్మోహన్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొత్తం 13 ద్విచక్ర వాహనాలకు ఒక్క ఆటో ఒక కారుకు వేలంపాట నిర్వహిస్తున్నామని, సదరు వాహనాలపై ఆసక్తి కలిగిన వారు వేలంలో పాల్గొనవచ్చునన్నారు. ద్విచక్ర వాహనాలు చూడాలనుకునేవారు పోలీస్ స్టేషన్ కు వచ్చి చూడవచ్చునన్నారు. మరిన్ని వివరాలకు పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ రవీంద్రనాయక్ ను సంప్రదించాలని ఆయన సూచించారు.

Post a Comment

Previous Post Next Post