Trishul News

బిడ్డలకు నిప్పంటించి తాను ఆత్మహత్యకు యత్నించిన కన్న తల్లి..!

- ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అమానవీయ ఘటన
- కర్ణాటక రాష్ట్రంలో వెలుగులోకి ఘటన

- బిడ్డలకు నిప్పు పెట్టిన మహిళ ఆచూకీ లభ్యం
మూలభాగల్, త్రిశూల్ న్యూస్ :
ఉమ్మడి చిత్తూరు జిల్లా మదనపల్లి నియోజకవర్గంలోని రామసముద్రం మండలానికి చెందిన ఓ మహిళ బుధవారం కర్ణాటక రాష్ట్రంలో తన ఇద్దరు బిడ్డలకు నిప్పంటించి తాను కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోవడానికి ఎత్నించిన ఘటన వెలుగులోకి రావడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. పేగుతెంచుకు పుట్టిన బిడ్డలకు నిప్పంటించి తాను కూడా ఆత్మ హత్య చేసుకుని చని పోవాలనుకున్న అమానవీయ ఘటన కర్ణాటక రాష్ట్రంలో జరిగిందని రామసముద్రం పోలీసులు తెలిపారు. ఈ దురాగతానికి ఒడిగట్టిన కాసాయి తల్లికి ఏం కష్టమొచ్చిందో ఏమో కఠినమైన నిర్ణయం తీసుకుంది. ఇద్దరు ఆడ బిడ్డలకు నిప్పటించిన తల్లి కళ్ళ ముందే కాలిపోతుంటే చూస్తూ ఉండిపోయిందే తప్ప కాపాడలేని నిస్సహాయరాలుగా మారింది ఆ తల్లి. తాను కూడా మంటల్లో దూకి చనిపోవాలనుకునే లోపే చుట్టు పక్కల వారు ఆమెను కాపాడారు. మృత్యువుతో పోరాడుతున్న పసిపాపను ఆస్పత్రికి, మరో పాప మృతదేహాన్ని ఆస్పత్రిలోని మార్చురీకి పోలీసులు తరలించారు. గుండెలు పిండేసే ఈ విషాదకర ఘటనకు వడిగట్టిన మహిళది రామసముద్రం మండలం, ఉలపాడు పంచాయతీ, బుసాని కురప్పల్లి గ్రామానికి చెందిన బుసన్న గారి శంకరప్ప లలితమ్మల కూతురు జ్యోతి అని పోలీసులు నిర్ధారించారు. కులాంతర వివాహం చేసుకుని సంసారాన్ని కష్టాల కడలిలో కొనసాగించలేక ఈమె బిడ్డలతో పాటు చనిపోవాలని కఠిన నిర్ణయం తీసుకుంది. ముందుగా తన ఇద్దరు కుమార్తెలకు నిప్పంటించినట్లు ప్రాధమిక దర్యాప్తులో తెలిసిందని పోలీసులు చెబుతున్నారు.

Post a Comment

Previous Post Next Post