Trishul News

కందుకూరు ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి..!

- మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, గాయపడిన వారికి 50వేలు ప్రకటన
న్యూడిల్లీ, త్రిశూల్ న్యూస్ :
నెల్లూరు జిల్లా కందుకూరులో టీడీపీ అధినేత చంద్రబాబు బహిరంగ సభలో తొక్కిసలాట జరిగి 8 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రధాని ఆకాంక్షించారు. మృతిచెందిన వారి కుటుంబాలకు కేంద్రం తరపున రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ. 50 వేల పరిహారాన్ని ప్రధాని ప్రకటించారు. ఏపీలోని నెల్లూరులో జరిగిన బహిరంగ సభలో జరిగిన దుర్ఘటన బాధాకరం. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నాం. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబీకులకు రూ. 2 లక్షల చొప్పున పీఎంఎన్‌ఆర్‌ఎఫ్‌ నుంచి ఎక్స్‌గ్రేషియా ఇవ్వబడుతుంది. గాయపడిన వారికి రూ. 50,000 అందజేస్తామని పిఎంఓ తెలిపింది.

Post a Comment

Previous Post Next Post