అమరావతి, త్రిశూల్ న్యూస్:
కుప్పంలో వందే భారత్ రైలు ఆపాలంటూ రైల్వే మంత్రికి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. ఈ లేఖను వందేభారత్ రైలు చీఫ్ కమర్షియల్ మేనేజర్కు టీడీపీ నేతలు అందించారు. 3 రాష్ట్రాల కూడలిలో కుప్పం సెంటర్గా ఉందని లేఖలో చంద్రబాబు తెలిపారు. ద్రావిడ వర్సిటీ, పీఈఎస్ మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీల విద్యార్థులు.. నిత్యం కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు రాకపోకలు కొనసాగిస్తుంటారని, కుప్పంలో రైలు ఆగితే అందరికీ ఉపయోగమని లేఖలో చంద్రబాబు ప్రస్తావించారు.
Tags:
ఆంధ్రప్రదేశ్