నెల్లూరు, త్రిశూల్ న్యూస్ :
ఇళ్ల తాళాలు పగలగొట్టి దొంగతనాలు చేస్తున్న నిందితుడిని నెల్లూరు బాలాజీ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి నగర డి.ఎస్.పి శ్రీనివాస్ రెడ్డి మంగళవారం సాయంత్రం మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీఏస్పీ మాట్లాడుతూ నెల్లూరు నగర పరిధిలో పలు దొంగతనాలు చేస్తూ దొరక్కుండా తిరుగుతున్న దాసరి రాజేంద్ర (22) స్థానిక మానస హోటల్ వద్ద అరెస్టు చేసి అతని వద్ద నుంచి సుమారు108 గ్రాముల బంగారం(13.5 సవర్లు), 150 గ్రాముల వెండిని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సిఐ రాములు నాయక్, ఎస్ఐ బోజ్య తదితరులు పాల్గొన్నారు.
Tags:
ఆంధ్రప్రదేశ్