Trishul News

చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటాం - రాయలసీమ జేఏసీ

- చంద్రబాబు కేంద్ర ప్రభుత్వమునకు, రాష్ట్రపతి, సుప్రీమ్ కోర్టు చీఫ్ జస్టిస్ కి లేఖ వ్రాయాలి

- అమరావతి జపం చేస్తూ కర్నూలు ప్రజల ఓట్లకోసం పర్యటన చేయడం దుర్మార్గం

- చంద్రబాబు కర్నూలు పర్యటన నిరసిస్తూ కొండారెడ్డి బురుజు మీద నల్ల బెలూన్స్ విడుదల
కర్నూలు, త్రిశూల్ న్యూస్ :
కర్నూలులో న్యాయరాజధానిని మరియు అభివృద్ధి, పరిపాలన వికేంద్రికరణను వ్యతిరేకిస్తూ కర్నూలులో చంద్రబాబు నాయుడు ఈ నెల 16,17,18 జిల్లా పర్యటనను నిరసిస్తూ రాయలసీమ విద్యార్థి, యువజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కర్నూలు కొండారెడ్డి బురుజు మీద నుంచి నల్ల బెలూన్స్ విడుదల చేసి చంద్రబాబుకు వ్యతిరేకంగా ఆందోళన చేశారు. ఈ సందర్బంగా రాయలసీమ విద్యార్థి, యువజన సంఘాల జేఏసీ నాయకులు సునీల్ రెడ్డి, శ్రీరాములు, చంద్రప్ప, రామినేని రాజునాయుడు, నాగరాజు, రెడ్డిపోగు ప్రశాంత్, శివ, బిసి సంక్షేమ సంఘము జాతీయ కార్యదర్శి నక్కల మిట్ట శ్రీనివాసులు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కేవలం అమరావతి జపం చేస్తూ పూర్తిగా రాయలసీమను విస్మరించి రాయలసీమకు మరి ముఖ్యంగా కర్నూలు అన్యాయం చేస్తున్నారు అని అన్నారు. చంద్రబాబు నాయుడుకి నిజంగా రాయలసీమ అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి ఉంటే తక్షణమే కర్నూలులో న్యాయరాజధాని ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వమునకు, రాష్ట్రపతికి, సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ కి లేఖ వ్రాయాలని వారు డిమాండ్ చేశారు. లేఖ వ్రాసిన తరువాత, రాయలసీమ ప్రజలకు క్షేమాపన చెప్పి కర్నూలు లో అడుగు పెట్టాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షములో 16,17,18 న జరిగే చంద్రబాబు పర్యటన అడ్డుకుంటాము అని వారు హెచ్చరించారు.. ఈ కార్యక్రమంలో రామరాజు, మనీరెడ్డి, వెంకీ, మధు, సంతోష్, సాయి తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post