Trishul News

ప్రజలకు మెరుగైన సేవలు అందించండి - తిరుపతి కమిషనర్ అనుపమ

తిరుపతి, త్రిశూల్ న్యూస్ :
సచివాలయ సిబ్బంది ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని నగరపాలక సంస్థ కమిషనర్ అనుపమ అంజలి సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం నగరంలోని కెనడి నగర్ లో గల 12, 13 వార్డు సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేసి, హాజరు నమోదుకు పరిశీలించారు. 
సమస్యలతో వచ్చిన వారి వినతులు స్వీకరించి వెంటనే పరిష్కరించాలన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించాలన్నారు. యూజర్ చార్జీలు, ఆస్తి పన్నులు వంటివి సకాలంలో వసూలు చేయాలన్నారు. సెక్రెటరీ లు, వాలంటీర్ల హాజరు నమోదు చేయాలన్నారు. రికార్డులు పక్కాగా నిర్వహించాలన్నారు. ప్రజల వద్ద నుండి వచ్చే పిర్యాదులను ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. కమిషనర్ వెంట హెల్త్ ఆఫీసర్ డాక్టర్ హరికృష్ణ తదితరులు ఉన్నారు.

Post a Comment

Previous Post Next Post