Trishul News

జనవరి 4నుండి కుప్పంలో చంద్రబాబు పర్యటన..!

కుప్పం, త్రిశూల్ న్యూస్ :
తెలుగుదేశం పార్టీ అధినేత, స్థానిక ఎమ్మెల్యే నారా చంద్రబాబు నాయుడు జనవరి 4, 5, 6 తేదీల్లో కుప్పంలో పర్యటిస్తారని ఆయన వ్యక్తిగత కార్యదర్శి మనోహర్‌ బుధవారం తెలిపారు. జనవరి 4న బెంగళూరు నుంచి శాంతిపురం మండలం చెంగుబల్లకు చేరుకుంటారన్నారు. చెంగుబల్ల, 121-పెద్దూరు, కెనమాకులపల్లెల్లో జరిగే 'ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి' కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. రాత్రి కుప్పం పట్టణంలోని ఆర్‌అండ్‌బీ అతిథిగృహానికి చేరుకుంటారన్నారు. 5, 6 తేదీల్లో రామకుప్పం, కుప్పం, గుడుపల్లెల్లో చేపట్టే కార్యక్రమాల షెడ్యూల్‌ పూర్తి కాలేదని చెప్పారు.

Post a Comment

Previous Post Next Post