చిత్తూరు, త్రిశూల్ న్యూస్ :
చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం లక్ష్మయ్య ఊరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ బోల్తా పడి ఆరుగురు మృతి చెందారు. 17 మంది గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు చిన్నారులు, డ్రైవర్ ఉన్నారు. పూతలపట్టు మండలం జట్టిపల్లిలో ట్రాక్టర్పై పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి వెళ్లి సహాయ చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను తిరుపతి స్విమ్స్, వేలూరు సీఎంసీకి తరలించారు. మృతులు ఐరాల మండలం బలిజపల్లికి చెందినవారిగా గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలో బలిజపల్లికి చెందిన 26 మంది ట్రాక్టర్లో ఉన్నారు. చిత్తూరు జిల్లాలోని పూతలపట్టు మండలంలో జరిగిన ప్రమాదం కు స్పందించిన జిల్లా కలెక్టర్ మరియు ఎస్పి. పూతలపట్టు మండలంలోని లక్ష్మయ్య ఊరు వద్ద జరిగిన ప్రమాదంలో ఒక వివాహానికి వెళ్తున్న వారు మరణించడం జరిగింది. సుమారు20 మందికి పైగా చతగాత్రులు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జిల్లా కలెక్టర్ ఎం హరి నారాయణన్, ఎస్ పి రీశాంత్ రెడ్డి లు క్షతగాత్రులకు తక్షణ వైద్య సౌకర్యం అందించాలని తీవ్రంగా గాయపడ్డ వారిని వెంటనే ఉన్నత ఆసుపత్రులకు తరలించే ఏర్పాటు చేయడం జరిగింది