Trishul News

అఖిల భారతీయ అయ్యప్ప ధర్మప్రచార సభ్యులకు ఘన సన్మానం..!

గోదావరిఖని, త్రిశూల్ న్యూస్ :
అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తు, అయ్యప్ప ధర్మ ప్రచారం చేస్తున్నందుకు గాను వారి సేవలను గుర్తించి (ఎబిఎపి) రాష్ట్ర ఉపాధ్యక్షులు చల్లా రవిందర్ రెడ్డి, నాయకులు తుమ్మ సురేష్, రవీ, పిల్లి శేఖర్, జనగామ తిరుపతి స్వాములను ఎఫ్ సిఐ అయ్యప్ప దేవాలయం చైర్మన్ ప్రభంజన్ రెడ్డి , లక్ష్మి నారాయణ గురుస్వామి మరియు కమిటి సభ్యులు బుధవారం అయ్యప్ప దేవాలయంలో ఘనంగ సన్మానించారు. ఈ సందర్బంగా ఎబిఎపి సభ్యుడు జనగామ తిరుపతి మాట్లాడుతు హిందు దేవాలయాలను దేవుళ్ళను, సాంప్రదాయాలను సంస్కృతిని కాపాడాలని అయ్యప్ప దీక్ష తీసుకుని ధర్మ ప్రచారం చేస్తున్న స్వాములను అభినందించారు. స్వాములు ఇళ్లల్లో చేసుకునే పడి పూజలను ప్రోత్సహించాలి అని అన్నారు. అనంతరం ఎబిఎపి రాష్ట్ర ఉపాధ్యక్షులు చల్లా రవీందర్ రెడ్డి మాట్లాదుతు నిరంతరం మదిలో అయ్యప్ప నామస్మరణ చేయాలి అని ఎన్ని కష్టనష్టాలు వచ్చినా అయ్యప్ప పాదములను విడువకుండ, ఎప్పుడు, ఎక్కడున్నా సరే ఎంతటి విపత్కర పరిస్థితిలలో ఉన్నా అయ్యప్పను విశ్వాసంతో, ఆర్తితో శరణు కోరాలి అని అన్నారు. మన ప్రతి సమస్యకు అయ్యప్ప పరిష్కారం చూపిస్తాడు అని అయ్యప్ప చీకటి నుండి వెలుగులోకి తీసుకు వచ్చే భారం వారే తీసుకుంటారు అని అన్నారు. నిత్యాన్నదానం చేస్తున్న దేవాలయ కమిటీని అభినందించి ఏబిఎపి సభ్యులను సన్మానించినందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు.

Post a Comment

Previous Post Next Post