Trishul News

ఎన్నికల యుద్దానికి పవన్ కళ్యాణ్ ప్రచార రథం సిద్ధం..!

అమరావతి, త్రిశూల్ న్యూస్ :
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు మరో ఏడాదిన్న సమయం ఉన్నా.. ఇప్పటికే అన్ని పార్టీలు కదనరంగంలోకి దూకేందుకు రెడీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికలకు పూర్తిస్థాయిలో సిద్ధమవుతున్నారు. త్వరలో బస్సు యాత్ర నిర్వహించేందుకు ప్లాన్ చేస్తుండగా.. ఇందుకు సంబంధించిన వాహనం రెడీ అయింది. ఈ వాహనంలో జనసేనానిని రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ప్రభుత్వంపై పోరాడనున్నారు. తన ప్రచార వాహనానికి సంబంధించి పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. ఈ వాహనానికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేస్తూ.. ఎన్నికల యుద్ధానికి వారాహి సిద్ధం అంటూ ఆయన క్యాప్షన్ ఇచ్చారు. వాహనం చుట్టూ బాడీ గార్డులు నడుచుకుంటూ.. వాహనం రెండు వైపులా ఇద్దరు నిల్చున్న వీడియోను పవర్‌ఫుల్‌గా చిత్రీకరించారు. వారహి వాహనాన్ని పరిశీలిస్తున్న ఫొటోలను కూడా ఆయన పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియోను పవన్ ఫ్యాన్స్, జనసేన నేతలు వైరల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికలకు పూర్తిస్థాయిలో సిద్ధమవుతున్నారు. త్వరలో బస్సు యాత్ర నిర్వహించేందుకు ప్లాన్ చేస్తుండగా.. ఇందుకు సంబంధించిన వాహనం రెడీ అయింది. ఈ వాహనంలో జనసేనానిని రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ప్రభుత్వంపై పోరాడనున్నారు. తన ప్రచార వాహనానికి సంబంధించి పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.

Post a Comment

Previous Post Next Post