Trishul News

డాక్టర్ పైడి అంకయ్యకు సిటీ ఎక్సలెన్స్ అవార్డు..!

తిరుపతి, త్రిశూల్ న్యూస్ :
ఇండియా న్యూస్ ఇండెక్స్ అనే దినవారి సామాజిక మీడియా సంస్థ 2022 సంవత్సరానికి గాను ఏర్పాటు చేసిన సిటీ ఎక్సలెన్స్ అవార్డులో భాగంగా తిరుపతి జిల్లాకు చెందిన వే ఫౌండేషన్ వ్యవస్థాపకుడు డాక్టర్ పైడి అంకయ్యకు బుధవారం సదరు అవార్డును న్యూస్ ఇండెక్స్ యాజమాన్యం సగర్వంగా ఆహ్వానించి సభా సమావేశంలో అందించారు. ఈ సందర్భంగా సదరు న్యూస్ ఇండెక్స్ సీఈవో ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ సామాజిక కార్యకర్తగా రాష్ట్ర, జాతీయ వ్యాప్తంగా అంకయ్య నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను గుర్తించి ఈ అవార్డును అందజేయడం జరిగినదని అభినందించారు. అవార్డు గ్రహీత డాక్టర్ పైడి అంకయ్య మాట్లాడుతూ సామాజిక మాధ్యమం నిర్వహిస్తున్న యాజమాన్యం నుంచి ఈ అవార్డు అందుకోవడం ఎంతో సంతోషంగా ఉన్నదని, సామాజిక మాధ్యమాల ద్వారా, దినపత్రిక ద్వారా తాను చూస్తున్న సమస్యల పట్ల వెంటనే స్పందిస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగినదని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సిటీ ఎక్సలెన్స్ అవార్డ్స్ వ్యవస్థాపకుడు, డైరెక్టర్ జయష్ భరద్వాజ్, అవార్డు గ్రహీతలు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post