Trishul News

కన్న కూతురుపై తండ్రి అఘాయిత్యం.. గర్భం దాల్చిన బాలిక..!

రంగారెడ్డి, త్రిశూల్ న్యూస్ :
కూతుళ్లపై తండ్రులు అత్యాచారానికి పాల్పడుతున్న ఘటనలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. కూతుళ్లకు రక్షణగా ఉండాల్సిన తండ్రులు వారిపై కామాంధులై దాడులకు పాల్పడుతున్నారు. అలాంటి ఘటనే రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలంలో వెలుగు చూసింది. కన్న తండ్రి వేధింపులతో ఆమె గర్భం దాల్చింది. ఆమనగల్లు మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఆమనగల్లు మండలంలో మైనర్ బాలికపై తండ్రి అత్యాచారం సంచలనంగా మారింది. నాలుగు నెలల క్రితం బతుకుదెరువు వెతుక్కుంటూ భార్య, పెద్ద కుమార్తెతో కలిసి దుండిగల్ వెళ్లాడు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు. పెద్ద కూతురు వయసు 14 ఏళ్లు. కూతురికి చదువు మాన్పించి వారితో పాటు పనికి తీసుకెళ్లాడు. సొంత గ్రామంలో ఉండగా.. దుండిగల్ వెళ్లిన తర్వాత తల్లి లేని సమయంలో బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ కూతురు ఎంత వద్దని చెప్పిన వినలేదు. కామంతో కన్నుమూసుకు పోయి కన్న కూతురు అన్న విషయం కూడా మరిచాడు. తనపై తన కామాన్ని తీర్చుకున్నాడు. నొప్పితో బాధ అనుభవిస్తూ వచ్చింది. ఎప్పటికప్పుడు తల్లితో చెప్పాలని ప్రయత్నించింది. అయితే తల్లితో చెప్పొద్దని బెదిరించాడు. దీంతో ఆపసి హృదయం భయపడింది. తండ్రి కామాన్ని భరించలేకపోయింది. సంక్రాంతి సందర్బంగా.. తన సొంతూరుకు రావడంతో.. తండ్రి భాగోతాన్ని కూతురు బట్టబయలు చేసింది. ఆ సమయంలో తండ్రి తనను వేధిస్తున్నాడని బాలిక తల్లి,అమ్మమ్మలకు చెప్పింది. ప్రస్తుతం బాలిక మూడు నెలల గర్భిణి. విషయం తెలియగానే కోపోద్రిక్తులైన బాలిక కుటుంబ సభ్యులు, బంధువులు కిరాతకుడుపై దాడి చేశారు. బాధిత బాలిక తల్లి తన భర్తపై సోమవారం ఆమనగల్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు తండ్రిని అదుపులో తీసుకున్నారు.

Post a Comment

Previous Post Next Post