న్యూడిల్లీ, త్రిశూల్ న్యూస్ :
వైఎస్.వివేకా హత్య కేసులో ఎ 1 నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి డిఫాల్ట్ బెయిల్ రద్దుపై సుప్రీం కోర్టు సోమవారం కీలక తీర్పునిచ్చింది. బెయిల్ రద్దు అంశం తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయాలని, మరోసారి విచారణ చేపట్టాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎర్ర గంగిరెడ్డి డిఫాల్ట్ బెయిల్ను రద్దు చేయాలని సుప్రీం కోర్టులో సిబిఐ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో... ఈరోజు సుప్రీం ఈ కీలక తీర్పును వెలువరించింది. ఈ నెల 5న గంగిరెడ్డి బెయిల్ రద్దుపై వాదనలు ముగిశాయి. గత విచారణ సమయంలో తీర్పును జస్టిస్ ఎమ్ఆర్ షా ధర్మాసనం రిజర్వ్ చేసింది. కేసులో మెరిట్స్ ఆధారంగా బెయిల్ రద్దు చేయాలా.. వద్దా అన్న విషయాన్ని నిర్ణయించాలని తెలంగాణ హైకోర్టును సుప్రీం ఆదేశించింది.