Trishul News

మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్‌ రెడ్డిలకు తప్పిన ప్రమాదం..!

రాయచోటి, త్రిశూల్ న్యూస్ :
మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డిలకు పెను ప్రమాదం తప్పింది. కాన్వాయ్‌లోని ఎంపీ మిథున్‌రెడ్డి వాహనాన్ని ఎదురుగా వచ్చిన ఓ కారు ఢీకొట్టింది. కారు ఓవర్‌టేక్ చేసే క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మిథున్‌రెడ్డి వాహనంలో ఉన్న 8 మందికి, ఎంపీ పీఏ, భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని రాయచోటి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి కలిసి వాహనంలో వెళ్తుండగా రాయచోటి మండలం చెన్నముక్కపల్లె రింగ్ రోడ్డు వద్ద ఘటన జరిగింది.

Post a Comment

Previous Post Next Post