Trishul News

అన్నీ కోడికత్తి డ్రామాలే.. ఇక వైసిపి పార్టీ పని అయిపోయింది - చంద్రబాబు

పీలేరు, త్రిశూల్ న్యూస్ :
తెదేపా ఫ్లెక్సీలు ఎందుకు చింపారని ప్రశ్నిస్తే కేసులు పెడతారా?' అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. అన్నమయ్య జిల్లా పీలేరు సబ్‌ జైలులో ఉన్న పుంగనూరు తెదేపా నేతలు, కార్యకర్తలను ఆయన సోమవారం పరామర్శించారు. ఈ సందర్భంగా పెద్దఎత్తున పార్టీ కార్యకర్తలు ఆయన వెంట తరలివచ్చారు. వారిని పరామర్శించిన అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ''ఏం తప్పు చేశారని తెదేపా కార్యకర్తలపై కేసులు పెట్టి వేధిస్తున్నారు. అక్రమ కేసులు పెట్టి తీవ్రంగా కొడతారా? తప్పు ఒప్పుకోవాలని ఒత్తిడి చేస్తారా? సీఐ, ఎస్సై చాలా దారుణంగా వ్యవహరించారు. భయపెట్టి మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచారు. నన్ను పీలేరు రాకుండా అడ్డుకుంటారా? నేనెక్కడికి వస్తే అక్కడ పోలీసు యాక్టు 30 పెడతారా? ఎంతమందిని జైల్లో పెడతారో మేమూ చూస్తాం. అక్రమ కేసులు పెడితే ఊరుకునేది లేదు. పోలీసులూ.. ఇకనైనా పద్ధతి మార్చుకోండి. పెద్దిరెడ్డి పనైపోయింది.. బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు'' అని చంద్రబాబు అన్నారు.
సబ్‌జైలు వద్ద తెలుగు మహిళలు ఆందోళన

అన్యాయంగా తమ వారిపై కేసులు పెట్టారని పీలేరులో మహిళలు ఆందోళనకు దిగారు. ఫ్లెక్సీల గొడవలో తమ వారికి సంబంధం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హత్యాయత్నం కేసులు పెట్టి తమవారిని వేధిస్తున్నారని ఆరోపిస్తున్నారు. మరోవైపు పీలేరు సబ్‌ జైలు వద్ద చంద్రబాబుతో మాట్లాడుతుండగా.. పర్వీన్‌ అనే మహిళ సొమ్మసిల్లి పడిపోయింది. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే ఆమెను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు.

Post a Comment

Previous Post Next Post