Trishul News

ఎస్వీబీసీ ట్ర‌స్టుకు రూ.10 ల‌క్ష‌లు విరాళం..!

తిరుమల, త్రిశూల్ న్యూస్ :
మహారాష్ట్రలోని ఔరంగాబాద్ కు చెందిన భక్తులు సురేష్ అజ్మీర్, సాగర్ అజ్మీర్ కలిసి రూ.10 లక్షలు ఆదివారం ఎస్వీబీసీ ట్ర‌స్టుకు విరాళంగా అందించారు. తిరుమలలోని నాదనీరాజనం వేదిక వద్ద మహారాష్ట్ర ఎంపి సంజయ్ జాదవ్, శ్రీశ్రీశ్రీ రమాకాంత్‌జీ వ్యాస్ మహరాజ్ సమక్షంలో ఈ విరాళాన్ని టిటిడి ఈఓ ఎవి.ధర్మారెడ్డికి అంద‌జేశారు. ఈ కార్యక్రమంలో సివిఎస్వో నరసింహ కిషోర్, ఎస్వీబీసీ సిఈఓ షణ్ముఖ కుమార్, విజిఓ బాలిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post