Trishul News

పెళ్లి సంబంధాలు చూస్తామంటూ పైసలు లాగేస్తున్నారు..!

- గీత గోవిందం మ్యారేజ్ బ్యూరోపై బాధితుడి ఆరోపణ 
తిరుపతి, త్రిశూల్ న్యూస్ :
పెళ్లి సంబంధాలు చూస్తామంటూ పైసలు తీసుకుని మోసం చేసారంటూ బాధితుడు కృష్ణమ నాయుడు ఆరోపించారు. గురువారం మన తిరుపతి ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. తిరుపతి అన్నమయ్య సర్కిల్ సమీపంలో ఉన్న గీతా గోవిందం మ్యాట్రిమోనీ పెళ్లి సంబంధాలు చూస్తానంటూ గత సంవత్సరం నవంబర్ నెలలో రూ.18 వేలు కట్టించుకుని ఇప్పటివరకు ఒక సంబంధం కూడా చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మాలాగే చాలా మంది వద్ద సంబంధాలు చూస్తానంటూ వేలకు వేలు డబ్బులు కట్టించుకుని ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారని బాధితులు ప్రశ్నిస్తే గీతగోవిందం మ్యారేజ్ బ్యూరో సిబ్బంది బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధితుడు ఆరోపణ చేశారు. ఇకనైనా ఇలాంటి మోసపూరిత మ్యాట్రిమోనీలను కట్టడి చేసి తమలా ఎవరు మోసపోకుండా చూడాలని కోరారు.

Post a Comment

Previous Post Next Post