తిరుమల, త్రిశూల్ న్యూస్ :
కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. టిటిడి అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. టిటిడి ఈఓ ఎవి.ధర్మారెడ్డి ఈ సందర్భంగా గజేంద్ర సింగ్ షెకావత్కు శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని, డైరీ, క్యాలెండర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి అంబటి రాంబాబు, ఎంపిలు మిథున్ రెడ్డి, రెడ్డెప్ప, టిటిడి మాజీ బోర్డు సభ్యులు భానుప్రకాష్రెడ్డి, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
Tags:
Tirumala