Trishul News

పులివెందుల తాసిల్దార్ కార్యాలయంలో విఆర్ఓపై కత్తితో దాడి..!

పులివెందుల, త్రిశూల్ న్యూస్ :
కడప జిల్లా పులివెందుల తాసిల్దార్ కార్యాలయంలో రాగిపాటి పెద్ద మస్తాన్ అనే వ్యక్తి పులివెందుల పట్టణ వీఆర్వో కృష్ణ మోహన్ రావు ను కత్తితో దాడి చేసిన సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే నగరగుట్ట ప్రాంతంలో భూమికి సంబంధించి రాగిపాటి మస్తాన్ బుధవారం తాసిల్దార్ కార్యాలయానికి వెళ్లి తన భూమి సంబంధించి ఆన్లైన్లోకించాలని విఆర్ఓ ను అడగడంతో దీనికి సంబంధించి భూమి కోర్టులో ఉందని చెప్పడంతో వీఆర్వో కృష్ణ మోహన్ రావు పై తన దగ్గర ఉన్న కత్తితో వెనకవైపున పొడిచాడు. అక్కడే ఉన్న సహ ఉద్యోగులు వెంటనే కత్తితో దాడి చేసిన వ్యక్తిని పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లారు. చికిత్స కోసం వీఆర్వోను ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై విఆర్ఓ మాట్లాడుతూ 2008 నుంచి ఈ వ్యక్తి భూమి కోసం తిరుగుతూ ఉన్నాడని భూమికి సంబంధించి కోర్టు కేసులో ఉందని గతంలో ఇతని పేరు మీద కాగితాలు అయితే ఉండేవని 2008లో భూసేకరణలో ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం జరిగిందని అతనికి ఎన్నిసార్లు చెప్పినా కూడా ఆన్లైన్ లో ఎక్కించాలని వస్తూ ఉంటారని. ఈ విషయంపైనే మళ్లీ ఈరోజు కూడా ఎమ్మార్వో కలయానికి రావడం జరిగిందని నా దగ్గరకు వచ్చి ఈ భూమి సంబంధించి మళ్లీ అడిగాడని నేను ఇది కోర్టులో కేసులో ఉందని చెప్పానని కానీ అతను కత్తి తీసుకొని నా వీపున పొడిచాడని తెలిపారు. తాసిల్దార్ కార్యాలయం సిబ్బంది అందరూ వీఆర్వో కృష్ణమోహన్ ను పరామర్శించారు. అలాగే పోలీస్ స్టేషన్కు వచ్చి దాడి చేసిన అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Post a Comment

Previous Post Next Post