Trishul News

జగన్ పిల్లల పాలిట కంసుడిలా తయారయ్యారు - చంద్రబాబు

కర్నూలు, త్రిశూల్ న్యూస్ :
ఆంధ్రప్రదేశ్‌కి సీఎం జగన్ ఒక్క పరిశ్రమనైనా తీసుకొచ్చారా? నిరుద్యోగులకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేకపోయారు. ఏపీలో జాబు రావాలంటే బాబు రావాల్సిందే అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. కర్నూలు జిల్లా దేవనకొండలో నిర్వహించిన రోడ్‌ షోలో చంద్రబాబు మాట్లాడారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తే దాన్ని ఎవరూ ధ్వంసం చేయలేదని.. తెదేపాను గెలిపించి ఉంటే ఏపీలో అభివృద్ధి జరిగేదన్నారు. 2029 నాటికి ప్రపంచ వ్యాప్తంగా ఏపీకి గుర్తింపు వచ్చేలా అభివృద్ధి చేసే వాళ్లమని చెప్పారు. నకిలీ విత్తనాల వల్ల రాష్ట్రంలోని రైతులు తీవ్రంగా నష్టపోయారు. జగన్ ఒక్క రైతును పరామర్శించలేదు. జగన్ దావుద్ ఇబ్రహీంను మించిపోయారు. అమ్మ ఒడి పేరుతో జగన్ పిల్లలను వేధిస్తున్నారు. జగన్ పిల్లల పాలిట మేనమామలా కాకుండా కంసుడిలా తయారయ్యారు. భూమి పట్టాదారు పాసు పుస్తకంపై జగన్ ఫొటో పెట్టుకోవడం సిగ్గుచేటు. కోడుమూరు ఎస్సై తెదేపా కార్యకర్తను కారణం లేకుండా కొట్టారు. పేకాట మంత్రి.. జాగ్రత్త.. ప్రజల జోలికొస్తే ఊరుకునేది లేదు. రౌడీలను అణిచివేసిన చరిత్ర తెదేపాది. మా కార్యకర్తల జోలికొస్తే వైకాపా నాయకుల తోకలు కత్తిరిస్తా. అన్నా క్యాంటీన్‌ల ద్వారా భోజనం పెట్టలేరు కానీ సాక్షి పత్రికకు రూ.వేల కోట్ల యాడ్స్ ఇస్తారు. 3 రాజధానులతో జగన్ డ్రామాలాడుతున్నారు. రాష్ట్రానికి రాజధాని ఏదో చెప్పుకోలేని విధంగా జగన్ చేశాడు అని చంద్రబాబు ధ్వజమెత్తారు.

Post a Comment

Previous Post Next Post