Trishul News

మైనర్ బాలికపై అత్యాచారం..పొక్సో కేసు నమోదు..!

మండపేట, త్రిశూల్ న్యూస్ :
మండపేట పట్టణ పరిధిలో 8వ తరగతి చదువుతున్న ఓ మైనర్ బాలికపై యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిపై టౌన్ ఎస్ఐ మద్దాల అశోక్ అత్యాచారం, పొక్సో కేసులు నమోదు చేశారు. రామచంద్రపురం డిఎస్పి బాలచంద్రారెడ్డి విచారణ చేపట్టారు. ఎస్ఐ అశోక్ తెలిపిన వివరాల ప్రకారం మండపేట పెద్ద కాల్వ సమీపంలో వాకా సింహాచలం నివాసం ఉంటుంది. ఈమె భర్త కొంతకాలం క్రితం ఈమెను వదిలేసి వేరే ప్రాంతనికి వెళ్ళిపోయాడు. ఈమె కుమార్తె (14)ను స్థానిక జెడ్పి బాలికోన్నత పాఠశాలలో చదివిస్తూ ఇళ్లలో పనిచేసుకొని  జీవనం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో పట్టణానికి చెందిన జాజుల రాజు అనే యువకుడు ఏడాదిగా ఈ బాలికను ప్రేమిస్తున్నానని చెప్పి వెంటపడేవాడు. ఈ విషయం ఇంట్లో తల్లికి చెబితే చదువు మానిపిస్తారనే భయంతో బాలిక తల్లికి చెప్పలేకపోయింది. ఈ నేపథ్యంలో తనను ప్రేమించకపోతే చచ్చిపోతానని తరుచూ బాలికను భయపెట్టేవాడు దీంతో విషయం తల్లికి చెప్పింది. దీంతో యువకుడి కుటుంబ సభ్యులకు చెప్పి యువకుడిని మందలించారు. ఈ నేపథ్యంలో మంగళవారం శివమాల ధరించిన సింహాచలం ఇల్లు శుభ్రం చేయాలని బాలికకు చెప్పి ఇళ్లలో పనికి వెల్లింది.ఇంటికి వచ్చి చూసేసరికి తలుపు వేసి ఉంది. ఆమె తలుపు తట్టడంతో లోపల నుండి రాజు బయటకు వచ్చి పరారయ్యాడని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇంట్లో బాలికను అత్యాచారం చేశాడని పేర్కొంది. దీంతో ఎస్ఐ అశోక్ అత్యాచారం, పొక్సో కేసులు నమోదు చేశారు. బాలికకు వైద్య పరీక్షలు ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించారు. అత్యాచారం ఘటనకు సంబంధించిన విచారణను డిఎస్పి బాలచంద్రారెడ్డి చేపట్టారు.

Post a Comment

Previous Post Next Post