Trishul News

రోడ్డు నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయండి - తిరుపతి కమిషనర్ అనుపమ

తిరుపతి, త్రిశూల్ న్యూస్ :
గొల్లవాణిగుంట రోడ్డు నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని కమిషనర్ అనుపమ అంజలి అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం ఇంజినీరింగ్, టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి గొల్లవాణిగుంట రోడ్డు నిర్మాణ పనులను కమిషనర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ టిడిఆర్ ఇచ్చిన స్థలాల్లో ఉన్న నిర్మాణాలను వెంటనే తొలగించాలన్నారు. ఒక సైడ్ సిసి రోడ్డు అయినా త్వరగా పూర్తి చేస్తే వాహనాల రాకపోకలకు అడ్డంకులు తొలగిపోతాయన్నారు. విద్యుత్ అధికారులతో మాట్లాడి రోడ్డుకు అడ్డంగా  ఉన్న కరెంట్ పోల్స్ తొలగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. వారం లోపు ఒక సైడ్ రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట కార్పొరేటర్ ఉమా అజయ్, అదనపు కమిషనర్ సునీత, డి.ఈ. విజయకుమార్ రెడ్డి, ఏసిపి షణ్ముగం, టి.పి.బి.ఓ. జగదీష్, తదితరులు ఉన్నారు.

Post a Comment

Previous Post Next Post