Trishul News

కందుకూరు ఘటన మృతులకు రూ.2లక్షలు పరిహారం - సీఎం జగన్

అమరావతి, త్రిశూల్ న్యూస్ :
నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బహిరంగ సభలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో 8 మృతిచెందగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడ్డ వారికి రూ.50వేల చొప్పున పరిహారం అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటన చేసింది. 

Post a Comment

Previous Post Next Post