విజయవాడ, త్రిశూల్ న్యూస్ :
భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి, ధర్మవరం ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి వై. సత్య కుమార్ యాదవ్ ని రాష్ట్ర కార్యదర్శి, శ్రీకాళహస్తి అసెంబ్లీ పార్టీ కన్వీనర్ కోలా ఆనంద్ విజయవాడలోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఘనంగా శ్రీకాళహస్తీశ్వరా స్వామివారి శేషవస్త్రంతో, తీర్థప్రసాదాలు ఇచ్చి ఘనంగాసన్మానించి, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సెక్రెటరీ, అసెంబ్లీ పార్టీ కో - కన్వీనర్ మేళాగారం సుబ్రమణ్యం రెడ్డి, రాష్ట్ర ఓబీసీమోర్ఛా సభ్యులు ఎస్వీ రమణ, జిల్లా యువమోర్ఛా ఉపాధ్యక్షులు సజ్జా హరీష్, శ్రీకాళహస్తి టౌన్ యువమోర్ఛా అధ్యక్షులు తానికొండ్ల భరత్ కుమార్ నాయుడు, నాని తదితరులు పాల్గొన్నారు.