Trishul News

మావోయిస్టుల కుట్రను విఫలం చేసిన ములుగు పోలీసులు..!

ములుగు, త్రిశూల్ న్యూస్ :
మందుపాతరాలు అమరుస్తుండగా ఒక డిప్యూటీ దళ కమాండర్,ఇద్దరు దళ సభ్యులు సహా ముగ్గురు మిలిషియా సభ్యులను అరెస్టు చేసిన పోలీసులు. తెలంగాణ- ఛత్తీస్గడ్ సరిహద్దులో గల వెంకటాపురం మండలం తడపాల అటవీ ప్రాంతంలో నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ కి చెందిన ఇద్దరు మహిళలు, నలుగురు మగ మిలిసియా సభ్యులను పట్టుకొన్న పోలీసులు. వారి వద్ద నుండి ఒక డిబిబిఎల్ ' తుపాకి, నాలుగు కిట్ బ్యాగులు, రెండు వాకి టాకీలతో పాటు భారీగా ప్రేలుడు సామాగ్రి స్వాధీనం.

పట్టుబడిన వారి వివరములు:

1) కారం భుద్రి @ రీతా D/o విజ్ఞాలు, వాజేడు-వెంకటాపురం ఏరియా కమిటీ దళ డిప్యుటీ కమాండర్,

2) సోడి కోసి @ మోతే D/o అడమాలు. పామేడు ఏరియా కమిటీ సభ్యురాలు,

3) సోడి విజయ్ @ ఇడుమ s/o జోగ, బెటాలియన్ సభ్యుడు.

4) కుడం దస్రు s/o గంగ, మిలిషియా సభ్యుడు.

5) సోడి ఉర్ర s/o గంగయ్య, మిలిషియా సభ్యుడు

6) మడకం భీమ s/ o కోస, మిలిషియా సభ్యుడు.

పట్టుబడిన మావోయిస్టులు పలు నేరారోపిత కేసులలో ప్రధాన నిందితులు. ప్రభుత్వ నిషేదిత సిపిఐ మావోయిస్టు పార్టీలో పని చేస్తూన్న మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసి పోలీస్ ఎదుట స్వచ్చందంగా లొంగిపోవాలని పిలుపునిచ్చిన జిల్లా ఎస్పీ శబరిష్.

Post a Comment

Previous Post Next Post