Trishul News

ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి స్వాగతం పలికిన వినుత కోటా

గన్నవరం, త్రిశూల్ న్యూస్ :
ప్రమాణ స్వీకారానికి విచ్చేసిన భారత ప్రధానమంత్రి శ్రీ. నరేంద్ర మోడీని గన్నవరం విమానాశ్రయంలో జనసేన పార్టీ తరఫున ఆహ్వానం పలికిన శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి వినుత కోటా. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, గవర్నర్ గవర్నర్ అబ్దుల్ నజీర్, చీఫ్ సెక్రటరీ, డి.జి.పి.తో కలిసి జనసేన పార్టీ ప్రతినిధిగా ప్రధానమంత్రి గారికి ఆహ్వానం పలకడం జరిగింది. 3 వ సారి ప్రధానమంత్రి అయిన సందర్భంగా నరేంద్ర మోడీకి పార్టీ తరఫున వినుత కోటా శుభాకాంక్షలు తెలిపి , ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం పలకడం జరిగింది.

Post a Comment

Previous Post Next Post