Trishul News

శ్రీకాళహస్తిలో ఘనంగా ప్రధాని నరేంద్రమోడీ జన్మదిన వేడుకలు..!

- మోదీ జన్మదిన వేడుకల్లో భాగంగా గవర్నమెంటు హాస్పిటల్ నందు పండ్లు, పాలు, బ్రేడ్స్ పంపిణీ
శ్రీకాళహస్తి, త్రిశూల్ న్యూస్ :
ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని స్థానిక గవర్నమెంటు హాస్పిటల్ నందు రాష్ట్ర కార్యదర్శి, అసెంబ్లీ పార్టీ కన్వీనర్ కోలా ఆనంద్ సుమారు 250 మంది ఔట్, ఇన్ పేసెంట్స్ లకు వివిధ రకాల పండ్లు, పాలు, బ్రెడ్డ్స్ రోగులందరికి పంపిణీ చేశారు. ఈ సంద్భంగా కోలా ఆనంద్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ అంచెలంచలుగా పార్టీలో ఎదిగి గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, 2014 నుంచి వరసగా మూడోసారి దేశ ప్రధానిగా కొనసాగుతూ, దేశం కోసం, ధర్మం కోసం పుట్టిన నరేంద్ర మోదీ పుట్టిన రోజు సంద్భంగా కోలా ఆనంద్ ఘనంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి, ఆయనకు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నరేంద్రమోడీ ప్రపంచ దేశాలలో భారతదేశ చరిత్ర ఇమిడింప చేసే విధంగా దేశ ప్రధానిగా ప్రపంచ అగ్ర నాయకుడుగా ఖ్యాతిని ఆర్జించిన ఏకైక జనాకర్షక పెద్దయనగా కీర్తిని సాధించిన నాయకులు నరేంద్ర మోదని కోలా ఆనంద్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ ఇన్చార్జి పార్థ సారధి, జిల్లా ప్రధాన కార్యదర్శి వరప్రసాద్, జిల్లా కార్యదర్శి అసెంబ్లీ పార్టీ కో కన్వీనర్ మేళాగారం సుబ్రమణ్యం రెడ్డి, రాష్ట్ర ఓబీసీమోర్చా సభ్యులు ఎస్వీ రమణ, మండల అధ్యక్షులు గరికపాటి రమేష్ బాబు, వేడం కృష్ణయ్య, పుణ్యం డిల్లీ కుమార్, సుబ్రమణ్యం రాజు, కన్నా వెంకటేశ్వర్లు, జీవి అమర్నాథ్, చొక్కని రవి చంద్ర, కోనేటి అయ్యప్ప, రవి, చెందు, బొక్కశం యుగంధర్, డాక్టర్ నారాయణ, రవి ఆచ్చారి, సురా బిందు కుమార్, నండ్ర విద్య సాగర్, కుమార్, శివ, పసుపులేటి మురళీ తదితరులు పాల్గోన్నారు.

Post a Comment

Previous Post Next Post