Trishul News

మహిళపై నలుగురు మృగాళ్ళు సామూహిక అత్యాచారం..!

- గదిలో నిర్బంధించి మూడు రోజులపాటు అమానుషం
పెనమలూరు, త్రిశూల్ న్యూస్ :
మహిళను గదిలో నిర్బంధించి మూడు రోజులపాటు నలుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడిన సంఘటన విజయవాడలో సోమవారం రాత్రి వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో బాధితురాలు అనారోగ్యం పాలవగా విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతోంది. నగరంలోని బెంజి సర్కిల్ వద్ద కూలి పనులు చేసుకుని బతికే ఓ మహిళను అదే ప్రాంతంలోని సులభ్ కాంప్లెక్స్ లో పని చేసే వ్యక్తి ఈ నెల 17న ఆమెకు మాయమాటలతో నమ్మించి కానూరు సనత్ నగర్ లోని ఓ గదికి తీసుకువెళ్లాడు. అక్కడ అతడితో పాటు మరో ముగ్గురు స్నేహితులు మద్యం మత్తులో మూడు రోజుల పాటు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు తీవ్ర అస్వస్థతతో సోమవారం నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేరడంతో ఈ అమానుషం వెలుగులోకి వచ్చింది. ఆసుపత్రి వర్గాల సమాచారంతో పెనమలూరు పోలీసులు వచ్చి బాధి తురాలితో మాట్లాడారు. సోమవారం రాత్రి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అత్యాచారానికి పాల్పడిన వ్యక్తుల కోసం గాలిస్తున్నారు.

Post a Comment

Previous Post Next Post