Trishul News

ప్రియురాలు పిలిచిందని పరుగున వెళ్లాడు.. చివరికి హాస్పిటల్ లో చేరాడు..!

రాజోలు, త్రిశూల్ న్యూస్ :
కోనసీమ జిల్లా రాజోలు మండలం తాటిపాకకు చెందని ఓ వివాహితకు.. గూడపల్లి గ్రామానికి చెందిన ఓ యువకుడి మధ్య కొంత కాలం నుంచి వివాహేతర సంబంధం కొనసాగుతుంది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం భర్త బయటకు వెళ్లాడని ప్రియుడికి ఫోన్ చేసింది. ఇంటికి రమ్మని పిలిచింది. దీంతో యువకుడు మహిళ ఇంటికి వెళ్లాడు. ఈ సమయంలో పలు విషయాలపై మహిళ ప్రియుడిని ఆరా తీసింది. మరో మహిళతో కూడా వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్నావంటూ అతనితో గొడవకు దిగింది. ఇద్దరి మధ్య మాటామాట పెరిగి ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో కోపంతో ఊగిపోయిన మహిళ బ్లేడ్‌తో అతని మర్మాంగాన్ని కోసేసింది. దీంతో తీవ్రంగా గాయపడిన ప్రియుడు బయటకు పరుగులు తీశాడు. గమనించిన స్థానికులు బాధితుడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితుడికి ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతుంది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

Post a Comment

Previous Post Next Post