Trishul News

నేటి ప్రపంచంలో కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి..!

 పుత్తూరు, త్రిశూల్ న్యూస్ :
నేటి పోటీ ప్రపంచంలో కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరిగా నేర్చుకోవాలని రాస్ జన్ శిక్షణ్ సంస్థాన్ ప్రోగ్రాం అధికారి హరిబాబు తెలిపారు. శనివారం పుత్తూరు పట్టణంలోని ఆపిల్ కంప్యూటర్స్ నందు 40 మంది విద్యార్థులకు రాస్ ఆధ్వర్యంలో ఉచిత కంప్యూటర్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా హరిబాబు మాట్లాడుతూ రాస్ ప్రధాన కార్యదర్శి వెంకటరత్నం ఆదేశాల మేరకు ఉచిత కంప్యూటర్స్ శిక్షణ తరగతు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుత సమాజంలో ఉద్యోగాన్వేషణ కోసం ఖచ్చితంగా కంప్యూటర్స్ పై పూర్తి స్థాయిలో అవగాహన ఉండాలని, పేదలకు 40 మంది అభ ఉచితంగా కంప్యూటర్స్పై ఉచిత శిక్షణ ఇచ్చి వారిని మెటిరీయల్స్ అందించినట్లు తెలిపారు. త్వరలో మరో బ్యాచ్ ప్రారంభిస్తున్నట్లు, ఉచిత కంప్యూటర్స్ శిక్షణ కొరకు రా కార్యాలయం నందు సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాస్ అధికారులు రవి, అన్బుళగన్, కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ మెంటర్ లోకేష్ పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post