రాజంపేట, త్రిశూల్ న్యూస్ :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవణ్ కళ్యాణ్ నటించిన చిత్రం "హరిహర వీరమల్లు" ఆయన కూటమి ప్రభుత్వంలో భాగమై డిప్యూటీ సి.ఎం అయ్యాక నిర్మాత ఏ.యం రత్నం ఎంతో ప్రతిస్టాత్మకంగా నిర్మించిన హరిహర వీరమల్లు సినిమా ఈరోజు రాత్రి ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న నేపథ్యంలో రాజంపేట జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల ఆహ్వానం మేరకు రాత్రి ఫ్యాన్స్ షో కి రాజంపేట పార్లమెంటు జనసేన పార్టీ సమన్వయకర్త అతికారి క్రిష్ణ హాజరు కానున్నారు. ముందుగా రాజంపేట జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నుండి సాయి ధియేటర్ వరకు అభిమానులు కార్యకర్తలు ఏర్పాటు చేసిన కోలాహలం "హరిహర వీరమల్లు పండుగ ర్యాలీలో" పాల్గొని అనంతరం వందలాదిమంది ప్రేక్షకులు, అభి మానులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలసి అభిమాన నాయకుడు నటించిన హరిహర వీరమల్లు సినిమాని వీక్షించనున్నారు.

No comments:
Post a Comment