- ఈ నెల 28 నుంచి దరఖాస్తులకు అవకాశం
అమరావతి, త్రిశూల్ న్యూస్ :
అటవీశాఖలో 100 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఎపిపిఎస్సి) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులకు కమిషన్ కార్యదర్శి రాజబాబు మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో బ్యాక్ లాగ్ పోస్టులు 30 ఉండగా, కొత్తగా 70 పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు ఈ నెల 28 నుంచి ఆగస్టు 17 వరకు పోస్టులకు దరఖాస్తు చేసుకునే అవకాశం కమిషన్ కల్పించింది. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టులకు నిర్వహిస్తున్న రోజే ఈ పోస్టులకు కూడా స్క్రీనింగ్ పరీక్ష సెప్టెంబరు 7న నిర్వహించనున్నట్లు వెల్లడించింది.

No comments:
Post a Comment