Trishul News

ఇంద్రకీలాద్రిపై దుర్గగుడి ఘాట్ రోడ్డు మూసివేత..!

విజయవాడ, త్రిశూల్ న్యూస్ :
ఇంద్రకీలాద్రిపై ఈ నెల 8 వ తేదీ నుంచి దుర్గగుడి ఘాట్ రోడ్డు మూసివేయనున్నారు. రాక్ ఫాల్ మిటిగేషన్ పనులనిమిత్తం మూడు రోజులపాటు ఘాట్ రోడ్డు మూసివేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. అమ్మవారి దర్శనార్ధం వచ్చే భక్తులు మహామండపం మీదుగా దర్శనానికి రావాలని దుర్గగుడి అధికారులు సూచించారు. ఇటీవలే ఆగష్టు ఒకటి నుండి మూడు వరకు ఘాట్ రోడ్డు అధికారులు మూసివేశారు.

Post a Comment

Previous Post Next Post