Trishul News

రొట్టెల పండుగ ఏర్పాట్లును పరిశీలించిన మంత్రి..!

నెల్లూరు, త్రిశూల్ న్యూస్ :
రొట్టెల పండుగ ఏర్పాట్ల పర్యవేక్షణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి శనివారం బారాషహీద్ దర్గాను సందర్శించారు. ఈ సందర్భంగా మత పెద్దల సమక్షంలో దర్గాలో ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించి ఈ ఏడాది నిర్వహించనున్న రొట్టెల పండుగ ఏలాంటి విఘ్నాలు లేకుండా ఘనంగా జరగాలని వారు ఆకాంక్షించారు. అనంతరం నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో స్వర్ణాల చెరువు ప్రాంగణంలో జరుగుతున్న రొట్టెల పండుగ నిర్వహణ ఏర్పాట్లను అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి మంత్రి పరిశీలించి వివిధ సూచనలు జారీ జేశారు. అన్ని ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసుకుంటూ భక్తులకు ఏలాంటి అసౌకర్యాలు కలుగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రణాళికా బద్ధంగా పారిశుద్ధ్య నిర్వహణ పనులను చేపట్టి రొట్టెల పండుగను అత్యంత ఘనంగా నిర్వహించేలా అధికారులు, ప్రజా ప్రతినిధులు, సిబ్బంది కృషి చేయాలని మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో రూరల్ నియోజకవర్గం శాసన సభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నగర పాలక సంస్థ మేయర్ పొట్లూరి స్రవంతి, కమిషనర్ డి.హరిత, స్థానిక కార్పొరేటర్ యాకసిరి వాసంతి తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post