తిరుమల, త్రిశూల్ న్యూస్ :
గరుడపంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుమలలో శ్రీమలయప్పస్వామివారు తమ ఇష్టవాహనమైన గరుడునిపై తిరుమాడ వీధులలో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. మంగళవారం రాత్రి గరుడ వాహనసేవ జరిగిన గరుడ సేవలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ గరుడ వాహనసేవలో సివిఎస్వో నరసింహ కిషోర్, ఆలయ డెప్యూటీ ఈవో రమేష్ బాబు, విజివో బాలిరెడ్డి, పారు ఫతేదార్ ఉమామహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Tags:
తిరుమల