Trishul News

పిడుగుపాటు బాధిత కుటుంబానికి రోజా చారిటబుల్ ట్రస్ట్ ఆర్ధిక సాయం..!

నగరి, త్రిశూల్ న్యూస్ :
రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక వ్యవహారాల యువజన సర్వీసుల క్రీడా శాఖామాత్యులు ఆర్.కె.రోజా సోదరులు రాంప్రసాద్ పిడుగుపాటు గురైన బాధిత కుటుంబానికి రోజా చారిటబుల్ ద్వారా బుధవారం ట్రస్ట్ ఆర్ధిక సాయం చేశారు. నగరి గ్రామీణ మండలం బుగ్గ అగ్రహారం గ్రామంలో మంగళవారం కురిసిన భారీ వర్షంతో పాటు పెద్ద ఎత్తున పిడుగు పడటంతో ఈశ్వరయ్య, రేణుక దంపతుల ఇల్లు మంటలకు అహుతి అయ్యింది. ఇంట్లో ఉన్న వస్తువులు మొత్తం మంటలతో కాలిపోవడంతో కట్టుబట్టలతో నిరాశ్రయులయ్యారు. ఈ విషయం తెలిసిన మంత్రిగారి సోదరులు రాంప్రసాద్ బుధవారం స్వయంగా వాళ్ల కుటుంబ సభ్యులను పరామర్శించి రోజా చారిటబుల్ ట్రస్టు ద్వారా 50 వేల రూపాయలు ఆర్ధిక సాయంతో పాటు బియ్యం పప్పు వంటి నిత్యావసర వస్తువులు మరియు కుటుంబ సభ్యులు ఒక్కోక్కరికి ఐదు జతల బట్టలు వంతున పంపిణి చేశారు.

Post a Comment

Previous Post Next Post