నెల్లూరు, త్రిశూల్ న్యూస్ :
జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు ఆదేశాల మేరకు నగర పాలక సంస్థలో ఉద్యోగులుగా బాధ్యతలు స్వీకరించిన 7 మంది దివ్యాంగులకు వివిధ విభాగాల్లో విధులను కేటాయిస్తూ కమిషనర్ హరిత శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వుల మేరకు పబ్లిక్ హెల్త్ విభాగం వర్కర్లుగా నాగరాజుపల్లి అమర్ నాథ్, కసినపోగు శ్రీనివాసులు, ఎస్టాబ్లిష్మెంట్ విభాగములో శనగపల్లి ప్రభాకర్, ఏ.వేణుగోపాల్, ఇంజనీరింగ్ విభాగంలో చెన్నుపాటి మమత, పులి క్రాంతి, మర్రి సుకన్య లకు విధులను కేటాయించారు. కేటాయించిన విధులను సిబ్బంది వెంటనే స్వీకరించాలని కమిషనర్ ఆదేశించారు.