- ఆర్ విఎస్, ఆర్ కె జేఏసి వ్యవస్థాపక అధ్యక్షుడు సీమ కృష్ణ
కర్నూలు, త్రిశూల్ న్యూస్ :
రాయలసీమ కోఆర్డినేట్ కమిటీ ఆధ్వర్యంలో డిసెంబర్ 22న ఆదోని పట్టణంలో జరిగే సీమ పిలుపు బహిరంగ సభను విజయవంతం చేయాలని రాయలసీమ ఉద్యమ యువ నాయకులు పిలిపునిచ్చారు. ఈ సందర్భంగా కర్నూలు రాయలసీమ విద్యార్థి సమైక్య వ్యవస్థాపకుడు మరియు రాయలసీమ కర్నూలు జేఏసీ అధ్యక్షుడు(ఆర్ కె జెఏసి) సీమ కృష్ణ మాట్లాడుతూ రాయలసీమ కోఆర్డినేట్ కమిటీ ఆధ్వర్యంలో మూడో వార్షికోత్సవం సందర్భంగా ఆదోని పట్టణంలో క్రియేషన్ క్లబ్ గ్రౌండ్లో జరిగే సీమ పిలుపు బహిరంగసభ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు. రాయలసీమలో పెండింగ్ ప్రాజెక్టులు మరియు కొత్త ప్రాజెక్టులు నిర్మాణం కోసం, కరువును రూపుమాపుకోడం కోసం అదేవిధంగ బాగ్ ఒప్పందంలోని అంశాలు పూర్తిగా సాధించుకోవడం నీళ్లు, నిధులు నియామకాల కోసం జరిగే సీమ పిలుపు బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్ విఎస్,ఆర్ కె జె ఎస్ సి నాయకులు భూషణం, గోపాల్, హరినాయుడు, సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.