Trishul News

వివిధ అభివృద్ధి పనులను పరిశీలించిన నెల్లూరు కమిషనర్ హరిత..!

నెల్లూరు, త్రిశూల్ న్యూస్ :
నగర పాలక సంస్థ పరిధిలో జరుగుతున్న రోడ్ల నిర్మాణాలు, డ్రైను కాలువల అభివృద్ధి పనులను కమిషనర్ హరిత అధికారులతో కలిసి గురువారం పరిశీలించారు. ముందుగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో భాగంగా స్థానిక మూలాపేట, రామయ్య బడి సమీపంలోని వీధుల్లో, వెంగళ్ రావు నగర్ ప్రాంతంలోని వివిధ వీధుల్లో జరుగుతున్న రోడ్డు నిర్మాణం పనులను పరిశీలించారు. కరెంట్ ఆఫీస్ కూడలిలోని నగర పాలక సంస్థ రూపొందించిన విగ్రహాల ఐ ల్యాండ్ కు మరమ్మతులు చేసి, పెయింటింగ్ పనులను చేపట్టాలని ఆదేశించారు. బుజ బుజ నెల్లూరు ప్రాంతంలో జరుగుతున్న డ్రైను కాలువల అభివృద్ధి పనులను పరిశీలించిన కమిషనర్, త్వరితగతిన పనులను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం స్థానిక కొత్తూరు శ్రామిక నగర్ లోని పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని కమిషనర్ సందర్శించి కేంద్రంలో అందుతున్న వైద్య సేవలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి, ఉత్తమ వైద్య సేవలు అందించాలని కమిషనర్ వైద్యులు, సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ విభాగం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post