Trishul News

ఏపీకి సైకో పాలన వద్దు.. సైకిల్ పాలన ముద్దు - చంద్రబాబు

గుంటూరు, త్రిశూల్ న్యూస్ :
 ఏపీకి సైకో పాలన వద్దు.. సైకిల్ పాలన ముద్దు అని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో ఇదేం ఖర్మ..మన రాష్ట్రానికి? కార్యక్రమంలో భాగంగా టీడీపీ చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను ఎదుర్కోలేక సంగం డెయిరీపై అక్రమ కేసులు పెట్టారని దుయ్యబట్టారు. సీఎం జగన్‌ కి సంగం వద్దు.. అమూల్‌ ముద్దు అన్నారు. సంగం రైతుల సంస్థ.. అమూల్‌ గుజరాత్‌ సంస్థ అని చంద్రబాబు తెలిపారు. నాలుగేళ్ల తర్వాత జగన్‌రెడ్డికి బీసీలు గుర్తుకొచ్చారా? అని ప్రశ్నించారు. విజయవాడ వైసీపీ సభకు బీసీలను బలవంతంగా తీసుకొచ్చారని, వైసీపీ సభకు రాకపోతే ప్రభుత్వ పథకాలు కట్ చేస్తామని బెదిరించారని, టీడీపీ సభలకు జనం స్వచ్ఛందంగా తరలివస్తున్నారని తెలిపారు. వైసీపీని బంగాళాఖాతంలో కలిపేందుకు జనం సిద్ధంగా ఉన్నారని, జగన్‌రెడ్డి తోకను త్వరలోనే కట్‌ చేస్తామని చంద్రబాబు హెచ్చరించారు.

Post a Comment

Previous Post Next Post