Trishul News

సిద్ధవటంలో ఘనంగా జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు..!

- సీఎం జగన్ చిత్ర పటానికి పాలాభిషేకం
ఒంటిమిట్ట, త్రిశూల్ న్యూస్ ప్రతినిధి, (కిరణ్ స్వామి) : 
వైయస్ జగన్మోహన్ రెడ్డి 50వ జన్మదిన వేడుకలను సిద్ధవటం మండలం తహసిల్దార్ కార్యాలయం ప్రాంగణంలో బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి భారీ కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఏ కుల రాజేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏ కుల రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశయాలతో గ్రామాలు పచ్చ తోరణం కార్యక్రమంలో భాగంగా మండల తాసిల్దార్ కార్యాలయం ప్రాంగణంలో మొక్కలను నాటారు. అనంతరం జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థులకు స్వీట్లు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ అభిమానులు ప్రజాప్రతినిధులు జన్మదిన వేడుకల్లో పాల్గొని మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా గెలవాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు.

Post a Comment

Previous Post Next Post