Trishul News

ఒంటిమిట్టలో కన్నుల పండుగగా జగనన్న జన్మదిన వేడుకలు..!

ఒంటిమిట్ట, త్రిశూల్ న్యూస్ ప్రతినిధి, (కిరణ్ స్వామి)
ఒంటిమిట్ట మండలం ఏకశిలా గ్రాండ్ హోటల్ నందు మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ రెడ్డి సుబ్బారెడ్డి సిద్ధవటం మండలం మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ ఉమ్మడి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను నిర్వహించారు. కేక్ ను కట్ చేసి మండల వైఎస్ఆర్సిపి నాయకులు అభిమానులకు పంచి జై జగన్ అంటూ నినాదాలు చేశారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలని వారు కోరారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు ఎన్నో కార్యక్రమాలు ప్రజలకు అందేలా.. ఎలాంటి లోపాలు లేకుండా ప్రతి ఒక్కరికి అందాల్సిన అందాల్సిన పథకాలు చేరువయ్యేటట్లు ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఇలాంటి ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలను మనమందరము మనస్పూర్తిగా జరుపుకుని ఆయన నూరేళ్లపాటు జీవించాలని ఉమ్మడి శ్రీధర్ రెడ్డి కోరారు.  ఈ కార్యక్రమంలో గజ్జల ఓబుల్ రెడ్డి, లక్ష్మీనారాయణ రెడ్డి, అద్దిరెడ్డి, రవి రెడ్డి, వేణు, రామిరెడ్డి, వైసిపి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post