తిరుమల, త్రిశూల్ న్యూస్ :
తిరుమలలో ఈనెల 28న రథసప్తమి వేడుకలు నిర్వహించనున్నట్టు తితిదే ఓ ప్రకటనలో తెలిపింది. సూర్య జయంతి సందర్భంగా శ్రీవారి ఆలయంలో రథసప్తమి పర్వదినం జరగనుంది. ఈ సందర్భంగా ఏడు వాహనాలపై స్వామివారు ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. రథ సప్తమి పర్వదినం నేపథ్యంలో ఆలయంలో నిర్వహించే కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను తితిదే రద్దు చేసింది.వాహన సేవల వివరాలు..
- ఉదయం 5.30 నుంచి 8 గంటల వరకు (సూర్యోదయం ఉదయం 6.45 గంటలకు) సూర్యప్రభ వాహనం.
- ఉదయం 9 నుంచి 10 గంటల వరకు చిన్నశేష వాహనం.
- ఉదయం 11 నుంచి 12 గంటల వరకు గరుడ వాహనం.
- మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు హనుమంత వాహనం.
- మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు చక్రస్నానం.
- సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు కల్పవృక్ష వాహనం.
- సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు సర్వభూపాల వాహనం.
- సాయంత్రం 8 నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనం