Trishul News

మా సమస్యలను పట్టించుకోండి - గవర్నర్​కు ఉద్యోగుల సంఘం విజ్ఞప్తి

విజయవాడ, త్రిశూల్ న్యూస్ :
ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కరం కోసం ఎప్రిల్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన ఆందోళన చేపడతామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె.ఆర్ సూర్యనారాయణ తెలిపారు. ఉద్యోగుల పట్ల వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఉద్యోగ సంఘ నేతలు నేడు ఏపీ గవర్నర్ ను కలిసి వినతిపత్రం అందించారు. ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ గత కొద్దికాలంగా ఉద్యోగులు, ఉద్యోగసంఘాల నేతలు ప్రభుత్వానికి తమ వినతులు, డిమాండ్ల ద్వారా... సమస్యలపై స్పందించాలని కోరుతూ వస్తున్నారు. అయినా ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో స్పష్టమైన విధానాన్ని ప్రభుత్వం చెప్పకపోవడంతో ఆందోళన చెందుతున్న ఉద్యోగులు తమ సమస్యలపై స్పందించాలంటూ ఈ రోజు గవర్నర్​ను కలిశారు. జీతాలకు సంబందించి చట్టం తీసువచ్చేందుకు ప్రయత్నించాలని కోరినట్లు వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కరం కోసం ఎప్రిల్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన ఆందోళన చేపడతామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె.ఆర్ సూర్యనారాయణ తెలిపారు. ఉద్యోగుల పట్ల వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఉద్యోగ సంఘ నేతలు నేడు ఏపీ గవర్నర్ ను కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సూర్యనారాయణ మాట్లాడుతూ ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు నిస్సహాయ స్థితిలో ఉన్నారని వాపోయారు. 90 వేలమంది ప్రభుత్వ ఉద్యోగుల అనుమతి లేకుండా వారి ఖాతాల నుంచి ప్రభుత్వం డబ్బులు తీసుకుందని, ఇదేమని అడిగితే తిరిగి ఇస్తామని చెపుతున్నారు తప్ప ఇవ్వడం లేదని పేర్కొన్నారు. ప్రభుత్వం తాను ఏర్పాటు చేసిన నిబంధనలను ప్రభుత్వమే ఉల్లంఘిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్ధికశాఖ అధికారులు, మంత్రి వర్గ ఉప సంఘం, ప్రభుత్వ సలహాదారులకు అందరికి ఉద్యోగుల సమస్యలు చెప్పామని వారు స్పందించకపోవడంతో తప్పని పరిస్థితుల్లో గవర్నర్​ని కలిసి ఫిర్యాదు చేశామన్నారు. రాష్ట్రంలో ఉద్యోగ సంఘాల మధ్య నాలుగు స్తంభాల ఆట నడుస్తోందన్నారు. ప్రభుత్వంస్పందించి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం చేస్తామన్నారు.

గవర్నర్​కు ఫిర్యాదు చేసిన ఉద్యోగ సంఘాల నేతలు

ఉద్యోగుల జీత భత్యాలు, ఆర్ధిక ప్రయోజనాల విషయంలో ప్రభుత్వం తన నిబంధనల్ని తానే ఉల్లంఘిస్తోంది. అందుకోసమే ఓ ప్రత్యేక చట్టం చేయాల్సిన అవసరం ఉంది. ఉద్యోగుల జీతాలను ఆలస్యం చేస్తున్నారు. తమ విజ్ఞప్తులను పెడచెవిన పెడుతున్నారు. అందుకనే రాష్ట్ర గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేశాం. చట్టం చేయాల్సిన అవసరం ఉందని గతంలో ఎవ్వరూ ఆలోచించలేదు. గత కొంత కాలంగా మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే చట్టం చేయాల్సిన అవసరం ఉందనే చెప్పాలి. చట్టం ఉంటే న్యాయంగా తమకు వచ్చే జీతాలు, ప్రయోజనాలు ఇచ్చేవారు. మంత్రులు, అధికారులకు, ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బంది... ఇలా అందరినీ కలిశాం.అయినా ఇప్పటివరకు స్పందించకపోవడంతో గవర్నర్​ను కలవడానికి వచ్చాం. ఉద్యోగులకు వివిధ రూపాల్లో వచ్చే అర్థిక లబ్ధికి సంబందించిన సమాచార హక్కు చట్టం ద్వారా అర్జీ పెట్టుకుంటే సమాచారం ఇవ్వడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే... రోడ్డు మీదకు వచ్చి నిరసన వ్యక్తం చేస్తామని సూర్యనారాయణ తెలిపారు.

Post a Comment

Previous Post Next Post